172వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

25 May, 2018 19:39 IST
పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 172వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం ఆకివీడు నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కుప్పనపుడి, కొలనపల్లి, కాళ్ల వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కాళ్ల మండలం నుంచి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. శేషాలి క్రాస్, జక్కారాం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.