ఉండూరు నుంచి 219వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
23 Jul, 2018 09:16 IST
తూర్పుగోదావరి జిల్లా: వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత సామర్లకోట మండలంలోని ఉండూరు నుంచి 219వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో సందడి మొదలైంది. అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. దారి పొడవునా స్థానిక ప్రజలు వైయస్ జగన్కు సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉండూరు నుంచి సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ సెంటర్ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి లంచ్ క్యాంప్ నుంచి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర చేపడతారు. సామర్లకోట మాతం సెంటర్, అయోధ్యా రామాపురం, చలపతి నగర్ మీదుగా గణపతి నగర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు.