208వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

8 Jul, 2018 10:13 IST
 

తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసమస్యల పోరాటం చేస్తూ వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర ఆదివారం 208వ రోజు దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మ‌హానేత‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పసలపూడి, చెల్లూరు మీదుగా మాచవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది.