స‌రిప‌ల్లి నుంచి 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

24 May, 2018 09:57 IST
 పశ్చిమ గోదావరి జిల్లా : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 170వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభించారు. అక్క‌డి నుంచి ఉండి నియోజకవర్గంలోని ఆరేడు, ఉప్పులూరు క్రాస్‌ రోడ్డు, పాములపర్రు, వెంకటరాజుపురం మీదుగా పెదకాపవరం వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు.