మహిళలతో వైయస్ జగన్ మమేకం
24 Feb, 2018 11:28 IST
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కనిగిరి మండలం చిన్న ఎర్లపాడు క్రాస్లో మహిళలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను జననేత దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు తమకు పింఛన్లు అందడం లేదని ఫిర్యాదు చేశారు. మనందరి ప్రభుత్వం వచ్చాక మహిళలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.