800 కిమీ పూర్తి చేసుకున్న వైయస్ జగన్
10 Jan, 2018 15:18 IST
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కళ్లవెంగనపల్లిలో 800 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా గ్రామంలో వైయస్ జగన్ మొక్కను నాటారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జననేత రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.