పారకాల్వ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

16 Jan, 2018 11:05 IST
చిత్తూరు :   వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 63వ రోజు కు చేరుకుంది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పారకాల్వ క్రాస్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి పత్తిపుత్తూరు, పుడి క్రాస్‌, అప్పలాయగుంట, యెనుములపాలెం, తిరుమన్యం, రాజుల కండ్రిగ, వేమపురం, గొల్ల కండ్రిగ వరకూ కొనసాగుతుంది. అనంతరం వడమల, వడమల పేటల మీదుగా పాడిరేడుకు వైయ‌స్‌ జగన్‌ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.