పెదనందిపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
20 Mar, 2018 11:19 IST
గుంటూరు : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 116వ రోజు మంగళవారం ఉదయం పెదనందిపాడు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి రాజుపాలెం క్రాస్, పాలపర్రు, పరిట్లవారిపాలెం క్రాస్, అన్నవరం క్రాస్ మీదగా ఉప్పలపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.