కాకుమాను నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
19 Mar, 2018 09:37 IST
గుంటూరు : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 115వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దివారిపాలెం, కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన పాదయాత్ర పెదనందిపాడు శివారు వరకు యాత్ర కొనసాగుతుంది.