ప్రారంభమైన 104వ రోజు ప్రజా సంకల్పయాత్ర
5 Mar, 2018 10:42 IST
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 104వ రోజుకుచేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ అద్దంకి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తక్కెళ్లపాడు, నాగులపాడు, వెంకటాపురం మీదుగా అలవలపాడు వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా తక్కెళ్లపాడులో జనంతో మమేకం కావడంతో పాటు అలవలపాడులో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.