నడిమికెల్ల నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

26 Nov, 2018 10:10 IST

 
  

 శ్రీకాకుళం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 306వ రోజు సోమవారం ఉదయం వీరఘట్టం మండలంలోని నడిమికెల్ల శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి విక్రంపురం, చిట్టపులి వలస క్రాస్‌, నడుకూరు, వీరఘట్టం, ఎమ్‌.రాజుపేట క్రాస్‌, చిదిమి క్రాస్‌ మీదుగా యు. వెంకంపేట వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జననేతను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నానంటూ వైయ‌స్‌ జగన్‌ భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు.