పప్పలవానిపాలెం క్రాస్‌ నుంచి 267వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

22 Sep, 2018 09:25 IST
 


విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని పప్పలవానిపాలెం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొలవానిపాలెం క్రాస్‌, భీమేంద్రపాలెం, ఎర్రవానిపాలెం క్రాస్‌, రామవరం మీదుగా గండిగుండం క్రాస్‌ వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. జ‌న‌నేత‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.