ఆనందపురం నుంచి 265వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

18 Sep, 2018 10:05 IST
 విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి నెట్టేరు, పాలవలస, సీతమ్మపాలెం, పందలపాక బీసీ కాలనీ, పందలపాక క్రాస్‌ రోడ్డు, తర్లువాడ, బాకురుపాలెం క్రాస్‌ రోడ్డు మీదుగా ముచ్చెర్ల క్రాస్‌ రోడ్డు వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.