బీచ్ రోడ్డు నుంచి 261వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
12 Sep, 2018 09:57 IST
విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 261వ రోజు విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం వైన్ఎ జగన్ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఉషోదయం జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాల్ జంక్షన్, ఎంవీపీ కాలనీ, వెంకోజీ పాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్ మీదుగా అరిలోవ జంక్షన్ వరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతుంది. అరిలోవ జంక్షన్ నుంచి చినగాదిలి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. చినగాదిలిలో ముస్లిం మైనార్టీలతో వైయస్ జగన్ ఆత్మీయ సమ్మెళనం కానున్నారు.