తాటిచెట్లపాలెం నుంచి 259వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

10 Sep, 2018 09:08 IST
 
 విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 259వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ విశాఖటపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్క‌డి నుంచి అక్కయ్య పాలెం, దొండపర్తి జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు పాదయాత్ర సాగనుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. వాల్తేరులో బ్రహ్మణుల ఆత్మీయ సదస్సులో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు. వాల్తేరు మెయిన్‌ రోడ్డు మీదుగా చిన్న వాల్తేరు వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.