214వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

16 Jul, 2018 18:56 IST

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 214వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కారకూడురు, అచ్యూతాపురం చేరుకుంటారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రామేశ్వరం, కొవ్వాడ వరకు పాదయాత్ర సాగుతుంది.