వైయస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యం
14 Jul, 2018 10:11 IST
తూర్పు గోదావరి: ఏపీకి ప్రత్యేక హోదా వైయస్ జగన్తోనే సాధ్యమవుతుందని తూర్పు గోదావరి జిల్లా వాసులు పేర్కొంటున్నారు. శనివారం వైయస్ జగన్ పాదయాత్రలో పలువురు విద్యార్థులు, యువకులు ప్రత్యేక హోదా ప్లకార్డ్సు పట్టుకొని వచ్చి జననేతకు మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలను వారు అభినందించారు. ప్రత్యేక హోదా మీ వల్లే సాధ్యమని నినదించారు.