కనీస సదుపాయాలు లేవన్నా..
17 Oct, 2018 14:41 IST
విజయనగరంః చిన్న భీమవరంలో వైయస్ జగన్ను మహిళలు కలిసి తమ సమస్యలు వివరించారు.సరైన రోడ్లు లేక తమ ఊరికి అంబులెన్స్ కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రవాణా సదుపాయం లేక పిల్లలు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని బోర్లులో వాటర్ తీసుకెళ్తే తాగునీటిలో పురుగులు ఉంటున్నాయని వాపోయారు.దీంతో రోగాల బారినపడుతున్నామన్నారు.డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదన్నారు.