జననేతను కలిసి గిరిజన జేఏసీ నేతలు
4 Mar, 2018 13:44 IST
ప్రకాశం: 2014 ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన టీడీపీ గిరిజనుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని గిరిజనులు మండిపడ్డారు. 103వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీరాంనగర్ చేరుకున్న వైయస్ జగన్ను గిరిజన సంఘాల జేఏసీ నాయకులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జననేతకు వినతిపత్రం అందజేశారు. గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ న్యాయం చేస్తానని వారికి భరోసా ఇస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.