నేడు మత్స్యకారులతో జననేత ఆత్మీయ సమ్మేళనం
21 Jul, 2018 12:00 IST
తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో కొనసాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న జననేత పాదయాత్ర జేఎన్టీయూ సెంటర్ నుంచి ప్రారంభమైంది. అచ్చంపేటలో మత్స్యకారులతో ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ పాల్గొంటారు.