ఉపాధ్యాయ సంఘాల వినతి
6 Jan, 2018 10:45 IST
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొడ్లవారిపల్లి శివారులో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, పదోన్నతులు కల్పించాలని వారు ప్రతిపక్ష నేతను కోరారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ఉపాధ్యాయులకు వైయస్ జగన్ హామీ ఇచ్చారు.