కాసేపట్లో చేనేతల ఆత్మీయ సమ్మేళనం
10 Apr, 2018 14:28 IST
గుంటూరు: చేనేతల సంక్షేమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. నేతన్నలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మంగళగిరిలో మధ్యాహ్నం 3 గంటలకు చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. మంగళగిరి పాతబస్టాండ్ వద్ద హీరా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు పూర్తయ్యాయి. సమ్మేళనానికి 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు తరలివచ్చారు.