వైయస్‌ జగన్‌ను కలిసిన సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు

24 Nov, 2018 13:30 IST
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా రెగ్యులర్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. సమస్యలపై వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.