జననేతను కలిసి రైవాడ కెనాల్ వర్కర్లు
4 Sep, 2018 12:51 IST
విశాఖపట్నం: రైవాడ కెనాల్ వర్కర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను జననేతకు వివరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, చాలీచాలని వేతనాలతో జీవితం గడుపుతున్నామని, జీతాల పెంపుకు కృషి చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు విన్న వైయస్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.