ఎస్సీ జాబితాలో చేర్చాలని రజకుల వినతి
19 Dec, 2017 15:36 IST
అనంతపురం: తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మంగళమడక గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రజకులు ప్రతిపక్ష నేతను కలిసి వినతిపత్రం అందజేశారు.