ప్రారంభమైన 118వ రోజు ప్రజాసంకల్పయాత్ర
22 Mar, 2018 07:59 IST
గుంటూరు: ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 118వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ పోలిరెడ్డిపాలెం శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి లింగం గుంట్ల, అప్పాపురం క్రాస్ మీదుగా కావూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. కావూరులో జననేత ప్రజలతో మమేకం కానున్నారు.