118వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
22 Mar, 2018 09:48 IST
గుంటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 118వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లాలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం పోలిరెడ్డిపాలెం శివారు నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి లింగంగుంట్ల, అస్రాపురం క్రాస్ మీదగా, కావురు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఇప్పటివరకు వైయస్ జగన్ 1,565.4 కిలోమీటర్లు నడిచారు.