112వ రోజు ప్రజాసంకల్పయాత్ర
14 Mar, 2018 11:07 IST
గుంటూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 112వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి చుండూర్పల్లి, ములకుదురు, మాచవరం క్రాస్ రోడ్డు మీదుగా చింతలపూడి చేరుకొని పార్టీ జెండాను ఎగురవేస్తారు. అక్కడి నుంచి పొన్నూరు ఐస్లాండ్ సెంటర్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.