నాయుడుపేట నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
25 Jan, 2018 10:40 IST
నెల్లూరు : ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు నాయుడుపేట శివారు నుంచి ప్రారంభమైంది. గురువారం ఉదయం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు. పూట క్రాస్ రోడ్డు, వర్ధరెడ్డి కండ్రిగ మీదుగా పునేపల్లి, నేమలపుడి వరకు సాగుతుంది. మధ్యాహ్నం నేమలపుడిలో భోజన విరామం ఉంటుంది. అనంతరం వైయస్ జగన్ పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. కరబులవొల్లు, వడ్డిపాలెం, సగట్టురు వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.