53వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
5 Jan, 2018 10:48 IST
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 53వ రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదూం మండలం నుంచి ప్రారంభమైంది. గాండ్లపల్లి, కంబంవారిపల్లి, కందూరు క్రాస్, సదూంకు చేరుకుంటారు. బట్టువారిపల్లి, గడ్కవారిపల్లె మీదుగా పాదయాత్ర సాగుతుంది.