చింతలపల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
23 Jun, 2018 09:39 IST
తూర్పు గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 196వ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం చింతలపల్లి నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కూనవరం, ములికిపల్లి, కడలి, వేగివారి పాలెం క్రాస్ల వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం గెద్దాడ, మొగలికుదురు, తాటిపాక వరకూ పాదయాత్ర సాగనుంది. తాటిపాక వద్ద సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశంలో వైయస్ జగన్ పాల్గొంటారు.