యర్రాయిచెరువు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
5 Jun, 2018 09:16 IST
పశ్చిమ గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. వైయస్ జగన్ మంగళవారం ఉదయం యర్రాయిచెరువు శివారు నుంచి 181వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్పూరు మీదుగా వీరభద్రపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.