మాడేపల్లికి చేరుకున్న పాదయాత్ర

14 May, 2018 16:24 IST

ఏలూరు: జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 161 రోజు నాటి పాదయాత్ర దెందులూరు నియోజకవర్గంలోని మాడేపల్లికి చేరుకుంది. కాసేపట్లో ఏలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించి 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన 40 అడుగుల పైలాన్ ను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.