మరికాసేపట్లో పశ్చిమగోదావరి జిల్లాలోకి పాదయాత్ర

13 May, 2018 14:17 IST

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర మరికొద్ది సేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలోకి అడుగుపెట్టనుంది. గత నవంబరు ఆరో తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇంతరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా పూర్తి అయ్యింది. కృష్ణా జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 24 రోజుల పాటు జరిగింది.