ప్రత్తిపాడులోకి ప్రజా సంకల్పయాత్ర
2 Apr, 2018 10:35 IST
అశేష ప్రజాభిమానాల మధ్య వైయస్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చేరుకుంది. అంతకుముందు ఉదయం తాడికొండ నియోజకవర్గం పేరిచర్ల నుంచి పాదయాత్రను ప్రారంభించి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శ్రీనివాసపురంలోకి జననేత ప్రవేశించారు. ఈ సందర్బంగా,నియోజకవర్గ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.