రామచంద్రాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర

2 Jul, 2018 18:04 IST

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి రామచంద్రాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొద్ది సేపటి క్రితం చింతాకుల వారి పేట, ఇంజరం గ్రామాల మీదుగా రామచంద్రాపురంలోని కాజలూరు మండలం కోలంక గ్రామంలోకి వైయస్ జగన్ అడుగుపెట్టారు.  ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానికులు జగన్ కు ఘన స్వాగతం పలికారు.