బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర

15 Oct, 2018 11:54 IST
విజ‌య‌న‌గ‌రంః ఏపీ ప్ర‌తిప‌క్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 286వ రోజు సోమవారం ఉదయం ఎస్‌. బూర్జవలస శివారు నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు. అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదులుతున్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. చౌదంతి వలస మీదుగా బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం పిండ్రంగి వలస, డొంకిన వలస, పెద్దపల్లి క్రాస్‌ మీదుగా లక్ష్మీపురం క్రాస్‌ వరకు ఈ రోజు పాదయాత్ర సాగనుంది. బొబ్బిలి నిమోజకవర్గంలోకి ప్రవేశించింది. బాడంగి మండలం పిండ్రంగి వలస వద్ద  వైయస్‌ జగన్‌కు ప్రజలు  ఘనస్వాగతం పలికారు.