ప్రజా సంకల్పయాత్ర 38 వ రోజు షెడ్యూల్

17 Dec, 2017 17:31 IST

వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం నాడు (38 వ రోజు) కూడా ధర్మవరం నియోజకవర్గంలోనే జరగుతుంది.  ఉదయం ఎనిమిది గంటలకు ధర్మవరం మండలం  నడిమిగడ్డ పాల్‌ క్రాస్‌లో ప్రారంభమై, 10 గంటలకు బిల్వంపల్లికి చేరుకుంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. 
10.30కు నెలకోట తండా లో పార్టీ జెండాను వైఎస్‌ జగన్‌ ఎగురవేస్తారు. మధ్యాహ్నం 3 గంటకు బుడ్డారెడ్డిపల్లెలో , 4.30కు ఎలకుంట్లలోను పాదయాత్ర జరుగుతుంది.   సాయంత్రం 6 గంటలకు తనకంటివారిపల్లికి చేరుకుంటుందని ఆయన వివరించారు.