ప్రారంభమైన 288 రోజు నాటి ప్రజాసంకల్పయాత్ర
17 Oct, 2018 10:44 IST
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జననేత బుధవారం నాడు 288 వ రోజు నాటి పాదయాత్రను బాడంగి మండలం పెద్ద భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.