గన్నవరం నుంచి ప్రారంభమైన 159 వ రోజు పాదయాత్ర

12 May, 2018 10:12 IST

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కృష్ణా జిల్లాలో ముగింపు దశకు చేరుకుంది.  జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి ప్రజల నుంచి  అపూర్వ ఆదరణ లభిస్తున్న ప్రజా సంకల్పయాత్ర  159 వ రోజు నాటి పాదయాత్ర గన్నవరం శివారు నుంచి శనివారం ప్రారంభమైంది.  మండవల్లి, చిగురుకోట క్రాస్ మీదుగా బైరవ పట్నం వరకు, అటు నుంచి మధ్యాహ్నం చావలిపాడు, మీదుకా కైకలూరుకు చేరుకుంటారు. కైకలూరులో జరిగే బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.