ప్రజలతో మమేకం అవుతూ రెండువాాారాలుగా ప్రతపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం నాడు ఆయన డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు బేతంచర్ల మండలంలోని గోరుగుట్ల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒకప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు షేక్ షావలీ దర్గా ప్రాంతానికి చేరుకుని, స్థానిక నాయకులతో ను అటుతరువాత, 10 గంటలకు పాణ్యం ప్రాంతానికి చెందిన నాయకులో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్లలో పర్యటిస్తూ, మధ్యాహ్నం 3.30 గంటలకు బస్టాండ్ సర్కిల్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కోలుములపల్లిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.