900 కిమీ చేరువలో ప్రజా సంకల్ప యాత్ర

21 Jan, 2018 10:15 IST

ప్రజా సంకల్పయాత్రలో తమ అడుగు జాడలు కూడా ఉండాలన్న అభిమానంతో   ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైయస్ ఆర్ సీపీ  అధినేత, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర 67వ రోజు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతున్న జననేత పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు చిందేపల్లి నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. కాసేపట్లో 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటనున్నారు.