వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగులు
22 May, 2018 13:23 IST
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 168వ రోజు దివ్యాంగులు వైయస్ జగన్ను కలిశారు. ముదునూరు వాసి మంగమ్మ, గోపి, నాగమణి వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో వికలాంగులకు రుణాలు అందేవని గుర్తు చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.