బొమ్ములూరుకు చేరుకున్న పాదయాత్ర

7 May, 2018 14:36 IST
గుడివాడ: 

ప్రజా సంకల్పయాత్ర గుడివాడ మండలంలోని సిద్ధాంతం నుంచి బొమ్ములూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. తమ ప్రాంతంలోని సమస్యలను వివరించారు. వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనను కలుసుకుని విజ్ఞాపన పత్రాలను సమర్పించారు. మధ్యాహ్నం తరువాత మార్కెట్‌ యార్డు పెద్దకాలువ సెంటర్‌ మీదుగా  నెహ్రూ చౌక్ వద్దకు పాదయాత్ర  చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొననున్నారు.