వైద్యుల సూచన మేరకు పాదయాత్ర వాయిదా

2 Nov, 2018 12:51 IST

హైదరాబాద్ : వైద్యుల సలహా మేరకు ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్ర వాయిదా పడింది.హత్యా యత్నం ఘటనలో గాయపడి చికిత్స తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు.  గాయం ఇంకా మానలేదని, నొప్పి కూడా తగ్గలేదని వారు పేర్కొన్నారు. గాయం తగ్గడానికి మరో 2 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు.ఈ నేపథ్యంలోనవంబరు 3 వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉన్న ప్రజా సంకల్పయాత్ర వాయిదా అనివార్యమైంది.