ప్రారంభమైన 102వ రోజు ప్రజా సంకల్పయాత్ర
3 Mar, 2018 11:08 IST
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 102వ రోజుకు చేరుకుంది. ఈ రోజు జననేత చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం దర్శి, శివరాంపురం, కొర్రపాటివారి పాలెం క్రాస్ మీదుగా తాళ్లూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా శివరాంపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు, సాయంత్రం తాళ్లూరు బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.