నేడు పాదయాత్రకు విరామం

31 May, 2018 13:50 IST

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు గురువారం విరామం ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వైయస్ జగన్ స్వల్ప అస్వస్థకు గురి కావడంతో వైద్యులు, పార్టీ నాయకుల వత్తిడి మేరకు గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం శుక్రవారం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.