జనం బాధలు ఎలా తీర్చాలో జగనన్నకు తెలుసు
21 Dec, 2017 15:33 IST
అనంతపురం: చంద్రబాబు పాలనలో తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రజల బాధలు ఎలా తీర్చాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు అని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. గురువారం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన వైయస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..బాబు నిర్వాహకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని తెలిపారు.