పోటెత్తిన కదిరి

23 Dec, 2017 17:08 IST
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కదిరికి చేరుకోవడంతో వేలాదిగా జనం తరలివచ్చారు. కదిరి పట్టణంలో ప్రవేశించిన జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న బహిరంగ సభకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో కదిరి పట్టణం జనసంద్రమైంది.