మైనారిటీ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరిక
16 Dec, 2017 17:42 IST
అనంతపురం: ధర్మవరం మైనార్టీ నేత అబ్దుల్ రవూఫ్, అనుచరులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం మల్కాపురం క్రాస్ వద్ద అబ్దుల్ రవూఫ్, అతని అనుచరులు వైయస్ జగన్ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పడంతో వారికి కండువాలు వేసి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. వైయస్ఆర్ కుటుంబంలో చేరడం సంతోషంగా ఉందని జననేత వైయస్ జగన్ పేర్కొన్నారు. మైనారిటీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.